News Monday, June 9, 2025 - 10:21
Submitted by andhra on Mon, 2025-06-09 10:21
Select District:
News Items:
Description:
AP DSC: ఆంధ్రప్రదేశ్లో ఏటా డీఎస్సీ, మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్
AP DSC: ఏపీ విద్యావ్యవస్థను నెంబర్వన్గా మార్చేందుకు ఏటా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఏటా డీఎస్సీ, మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్
Source : AI
AP DSC: నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మెగా డీఎస్సీ ద్వారా 16వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు వివరించారు. ఇకపై ఇదే కంటిన్యూ అవుతుందని వివరించారు. ఉపాధ్యాయుల భర్తీ చేస్తూ విద్యా ప్రమాణాలు మెరుగు పరుస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఆదర్శవంతమైన విద్యావిధానం తీసుకొస్తామని వెల్లడించారు.
వయోజన విద్యకు ప్రాధాన్యత
పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్ విద్యాసంవత్సర సన్నద్ధతను పరిశీలించారు. రాష్ట్రాన్ని వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు అ-ఆ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. అక్షర ఆంధ్ర పేరుతో ఈ ప్రాజెక్టులో అందరూ భాగమవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టే అఆ ప్రాజెక్టులో 15 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వారిని అక్షరాస్యులుగా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏజ్ గ్రూప్లో నిరక్షరాస్యులుగా ఉన్న వారు ఏపీలో 81 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీళ్లకు చదువు నేర్పిస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వంద శాంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే తక్షణమే అఆ వయోజన విద్యామిషన్ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ విభాగంలో ఖాళీగా ఉన్న 109 పోస్టులను విద్యాశాఖ నుంచి భర్తీ చేసుకోవాలని సూచించారు.
పారదర్శకంగా బదిలీలు
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడమే కాకుండా సర్వీస్లో ఉన్న వారికి పదోన్నతలు కల్పించామన్నారు. ఎలాంటీ రికమండేషన్స్ లేకుండా టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా బదిలీలు చేపట్టామన్నారు. 4 వేల మందికి ప్రమమోషన్లు ఇస్తే... 27వేల మంది SAస్కూల్ అసిస్టెంట్లను బదిలీలు చేశామని వివరించారు.
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 16వేల పోస్టుల భర్తీకి ఇవాల్టి నుంచి పరీక్షలు జరగుతున్నాయి. రోజుకు రెండు పూటలు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో పరీక్షల సెంటర్లు ఇచ్చారు.
శుక్రవారం ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు 30వ తేదీ వరకు కొనసాగునున్నాయి. మొదటి రోజు జరిగిన డీఎస్సీ పరీక్షకు దాదాపు 87 శాతం మంది హాజరయ్యారని అధికారులు లోకేష్కు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16437 పోస్టులకు 3,36, 305 మంది అప్లై చేశారు. వీళ్ల నుంచి 5, 77,675 దరఖాస్తులు వచ్చాయి. వీళ్లకు 44 దశల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు దయం 9 గంటల నుంచి 12.30వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 137 ఎగ్జామ్ సెంటర్లు, ఇతరాష్ట్రాల్లో అంటే హైదరాబాద్, బెర్హంపూర్, చెన్నై, బెంగళూరులో మరో 17 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తొలిరోజు ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు ముగిశాయి. ఉదయం 91 కేంద్రాల్లో16, 102 మందికి 14, 281 మంది, సాయంత్రం 51 కేంద్రాల్లో 8790 మందికి 7611 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా కడప, నెల్లూరు జిల్లాల్లో పరీక్షకు అభ్యర్థులు హాజరయ్యారు.
Regional Description:
AP DSC: ఆంధ్రప్రదేశ్లో ఏటా డీఎస్సీ, మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్
AP DSC: ఏపీ విద్యావ్యవస్థను నెంబర్వన్గా మార్చేందుకు ఏటా డీఎస్సీ ద్వారా పోస్టులు భర్తీ చేస్తామన్నారు మంత్రి నారా లోకేష్. ఇప్పటికే పలు సంస్కరణలు తీసుకొచ్చామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఏటా డీఎస్సీ, మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్
Source : AI
AP DSC: నిరుద్యోగులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. ఇకపై ప్రతి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే మెగా డీఎస్సీ ద్వారా 16వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు వివరించారు. ఇకపై ఇదే కంటిన్యూ అవుతుందని వివరించారు. ఉపాధ్యాయుల భర్తీ చేస్తూ విద్యా ప్రమాణాలు మెరుగు పరుస్తామని పేర్కొన్నారు. నాలుగేళ్లలో ఆదర్శవంతమైన విద్యావిధానం తీసుకొస్తామని వెల్లడించారు.
వయోజన విద్యకు ప్రాధాన్యత
పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్య, వయోజన విద్య, సమగ్రశిక్ష ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి నారా లోకేష్ విద్యాసంవత్సర సన్నద్ధతను పరిశీలించారు. రాష్ట్రాన్ని వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు అ-ఆ పేరుతో ప్రాజెక్టు ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. అక్షర ఆంధ్ర పేరుతో ఈ ప్రాజెక్టులో అందరూ భాగమవ్వాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టే అఆ ప్రాజెక్టులో 15 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న వారిని అక్షరాస్యులుగా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఏజ్ గ్రూప్లో నిరక్షరాస్యులుగా ఉన్న వారు ఏపీలో 81 లక్షల మంది ఉన్నారని తెలిపారు. వీళ్లకు చదువు నేర్పిస్తే కచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వంద శాంత అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అందుకే తక్షణమే అఆ వయోజన విద్యామిషన్ ప్రారంభించాలని ఆదేశించారు. ఈ విభాగంలో ఖాళీగా ఉన్న 109 పోస్టులను విద్యాశాఖ నుంచి భర్తీ చేసుకోవాలని సూచించారు.
పారదర్శకంగా బదిలీలు
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేయడమే కాకుండా సర్వీస్లో ఉన్న వారికి పదోన్నతలు కల్పించామన్నారు. ఎలాంటీ రికమండేషన్స్ లేకుండా టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా బదిలీలు చేపట్టామన్నారు. 4 వేల మందికి ప్రమమోషన్లు ఇస్తే... 27వేల మంది SAస్కూల్ అసిస్టెంట్లను బదిలీలు చేశామని వివరించారు.
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
ఏడాది క్రితం జరిగిన ఎన్నికల్లో డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం అందుకు తగ్గట్టుగానే ఏప్రిల్లో నోటిఫికేషన్ విడుదల చేసింది. 16వేల పోస్టుల భర్తీకి ఇవాల్టి నుంచి పరీక్షలు జరగుతున్నాయి. రోజుకు రెండు పూటలు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశాలో పరీక్షల సెంటర్లు ఇచ్చారు.
శుక్రవారం ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు 30వ తేదీ వరకు కొనసాగునున్నాయి. మొదటి రోజు జరిగిన డీఎస్సీ పరీక్షకు దాదాపు 87 శాతం మంది హాజరయ్యారని అధికారులు లోకేష్కు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 16437 పోస్టులకు 3,36, 305 మంది అప్లై చేశారు. వీళ్ల నుంచి 5, 77,675 దరఖాస్తులు వచ్చాయి. వీళ్లకు 44 దశల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలు దయం 9 గంటల నుంచి 12.30వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 137 ఎగ్జామ్ సెంటర్లు, ఇతరాష్ట్రాల్లో అంటే హైదరాబాద్, బెర్హంపూర్, చెన్నై, బెంగళూరులో మరో 17 కేంద్రాలు ఏర్పాటు చేశారు.
తొలిరోజు ఎలాంటి అవాంతరాలు లేకుండా పరీక్షలు ముగిశాయి. ఉదయం 91 కేంద్రాల్లో16, 102 మందికి 14, 281 మంది, సాయంత్రం 51 కేంద్రాల్లో 8790 మందికి 7611 మంది పరీక్ష రాశారు. అత్యధికంగా కడప, నెల్లూరు జిల్లాల్లో పరీక్షకు అభ్యర్థులు హాజరయ్యారు.