News Monday, April 21, 2025 - 10:20
Submitted by andhra on Mon, 2025-04-21 10:20
Select District:
News Items:
Description:
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
AP Mega DSC 2025 Application | ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి ఆన్లైన్లోనే మే 15వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
AP DSC Notification released for 16347 Teaching Posts | అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదివారం నాడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లోనే దరఖాస్తులు, ఫీజు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని అభ్యర్థులకు సూచించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శనివారం ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ఓర్పు, పట్టుదల, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయుల నియామకం కీలక అంశమని లోకేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మెగా డీఎస్సీ సంబంధించిన జీవో, టీచర్ పోస్ట్ల వివరాలు, ఎగ్జామ్ షెడ్యూలు, సిలబస్ ఇలాంటి పూర్తి వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://apdsc.apcfss.in/# ను సందర్శించాలని సూచించారు.
డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్స్ ఇవే
https://cse.ap.gov.in
https://apdsc.apcfss.in
ఏపీ మెగా డీఎస్సీ షెడ్యూల్
- ఏప్రిల్ 20వ తేదీన ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ప్రారంభం
- మే 15 దరఖాస్తుల స్వీకరణకు ముగియనున్న గడువు
- మే 20వ తేదీ నుంచి మాక్ టెస్టుల నిర్వహణ
- మే 30 డీఎస్సీ ఎగ్జామ్ హాల్టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం
- జూన్ 6 నుంచి జులై 6 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణ
అన్ని పరీక్షలు పూర్తయ్యాక రెండు రోజుల తరువాత ప్రాథమిక ‘కీ’ విడుదల కానుంది. అనంతరం 7 రోజులపాటు అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వారం రోజులకు డీఎస్సీ ఎగ్జామ్స్ ఫైనల్ ‘కీ’ విడుదల చేయనున్నారు. మరో వారం రోజులకు డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల కానుంది.
మెగా డీఎస్సీ పోస్టుల వివరాలివే..
మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, పురపాలక, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులకు జిల్లా స్థాయిలో నియామక ప్రక్రియ ఉంటుంది. ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలతో పాటు బధిర, అంధుల స్కూల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిల్లో భర్తీ చేస్తారు.
ఎస్జీటీ పోస్టులు 6,599 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,487, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు కలిపి మొత్తం 14,088 పోస్టులున్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు 259 ఉన్నాయి. జోన్-1లో 400 పోస్టులు, జోన్-2లో 348 పోస్టులు, జోన్-3లో 570, జోన్-4లో అత్యధికంగా 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక స్కూళ్లలో మొత్తం 13,192 పోస్టులు ఉన్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువెనైల్ పాఠశాలల్లో 15 ఖాళీలు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
Regional Description:
AP DSC Notification 2025: ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
AP Mega DSC 2025 Application | ఆంధ్రప్రదేశ్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశారు. నేటి నుంచి ఆన్లైన్లోనే మే 15వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు సూచించారు
ఏపీ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తులు ప్రారంభం- పూర్తి వివరాలివే
AP DSC Notification released for 16347 Teaching Posts | అమరావతి: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది. ఏపీ పాఠశాల విద్యాశాఖ ఆదివారం నాడు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఆదివారం ఉదయం విడుదల చేశారు. ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ వరకు ఆన్లైన్లోనే దరఖాస్తులు, ఫీజు చెల్లింపులు చేయాల్సి ఉంటుందని అభ్యర్థులకు సూచించారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అభ్యర్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) శనివారం ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. ఓర్పు, పట్టుదల, అంకిత భావం కలిగిన ఉపాధ్యాయుల నియామకం కీలక అంశమని లోకేష్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం మెగా డీఎస్సీ సంబంధించిన జీవో, టీచర్ పోస్ట్ల వివరాలు, ఎగ్జామ్ షెడ్యూలు, సిలబస్ ఇలాంటి పూర్తి వివరాలను విద్యాశాఖ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు. పూర్తి వివరాలకు, దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ http://apdsc.apcfss.in/# ను సందర్శించాలని సూచించారు.
డీఎస్సీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు డైరెక్ట్ లింక్స్ ఇవే
https://cse.ap.gov.in
https://apdsc.apcfss.in
ఏపీ మెగా డీఎస్సీ షెడ్యూల్
- ఏప్రిల్ 20వ తేదీన ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ప్రారంభం
- మే 15 దరఖాస్తుల స్వీకరణకు ముగియనున్న గడువు
- మే 20వ తేదీ నుంచి మాక్ టెస్టుల నిర్వహణ
- మే 30 డీఎస్సీ ఎగ్జామ్ హాల్టికెట్ల డౌన్లోడ్ ప్రారంభం
- జూన్ 6 నుంచి జులై 6 వరకు డీఎస్సీ పరీక్షల నిర్వహణ
అన్ని పరీక్షలు పూర్తయ్యాక రెండు రోజుల తరువాత ప్రాథమిక ‘కీ’ విడుదల కానుంది. అనంతరం 7 రోజులపాటు అభ్యర్థుల నుంచి అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఇచ్చారు. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన వారం రోజులకు డీఎస్సీ ఎగ్జామ్స్ ఫైనల్ ‘కీ’ విడుదల చేయనున్నారు. మరో వారం రోజులకు డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల కానుంది.
మెగా డీఎస్సీ పోస్టుల వివరాలివే..
మెగా డీఎస్సీలో భాగంగా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కానున్నాయి. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, పురపాలక, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులకు జిల్లా స్థాయిలో నియామక ప్రక్రియ ఉంటుంది. ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలలతో పాటు బధిర, అంధుల స్కూల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిల్లో భర్తీ చేస్తారు.
ఎస్జీటీ పోస్టులు 6,599 ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,487, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులు కలిపి మొత్తం 14,088 పోస్టులున్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు 259 ఉన్నాయి. జోన్-1లో 400 పోస్టులు, జోన్-2లో 348 పోస్టులు, జోన్-3లో 570, జోన్-4లో అత్యధికంగా 682 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక స్కూళ్లలో మొత్తం 13,192 పోస్టులు ఉన్నాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881 పోస్టులు, జువెనైల్ పాఠశాలల్లో 15 ఖాళీలు, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.