News Monday, April 21, 2025 - 10:11

Select District: 
News Items: 
Description: 
RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాలు ఇలా RRB ALP Recruitment: రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ అప్లికేషన్ RRB ALP Application 2025: రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,970 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా.. మే 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు. ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్. వివరాలు.. * అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు ఖాళీల సంఖ్య: 9,970. ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా ఖాళీలు ➥ అహ్మదాబాద్: 497 పోస్టులు ➥ అజ్మీర్: 820 పోస్టులు ➥ ప్రయాగ్‌రాజ్‌: 588 పోస్టులు ➥ భోపాల్‌: 664 పోస్టులు ➥ భువనేశ్వర్: 928 పోస్టులు ➥ బిలాస్‌పూర్: 568 పోస్టులు ➥ చండీఘడ్‌: 433 పోస్టులు ➥ చెన్నై: 362 పోస్టులు ➥ గువాహటి: 30 పోస్టులు ➥ జమ్ము అండ్‌ శ్రీనగర్: 08 పోస్టులు ➥ కోల్‌కతా: 720 పోస్టులు ➥ మాల్దా: 432 పోస్టులు ➥ ముంబయి: 740 పోస్టులు ➥ ముజఫర్‌పూర్: 89 పోస్టులు ➥ పట్నా: 33 పోస్టులు ➥ ప్రయాగ్‌రాజ్: 286 పోస్టులు ➥ రాంచీ: 1,213 పోస్టులు ➥ సికింద్రాబాద్: 1,500 పోస్టులు ➥ సిలిగురి: 95 పోస్టులు ➥ తిరువనంతపురం: 148 పోస్టులు ➥ గోరఖ్‌పూర్: 100 పోస్టులు అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ దరఖాస్తుకు అర్హులు. వయోపరిమితి: 01.07.2025 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-6-8 సంవత్సరాలు; రైల్వేలో గ్రూప్-సి, గ్రూప్-డి విభాగంలో పనిచేస్తున్నవారికి 40-43-45 సంవత్సరాలు; వితంతువులు, ఒంటరి మహిళలకు 35-38-40 సంవత్సరాలు; 25 సంవత్సరాలలోపు ఉండి అప్రెంటిస్ పూర్తిచేసినవారికి 35-38-40 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. కంప్యూటర్ ఆధారిత పరీక్ష: స్టేజ్-1 పరీక్ష విధానం.. మొత్తం 75 మార్కులకు స్టేజ్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ⅓ మార్కులు కోత విదిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ సైన్స్ మరియు కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. స్టేజ్-2 పరీక్ష విధానం.. మొత్తం 175 మార్కులకు స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 150 నిమిషాలు. ఇందులో పేపర్-1 నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇక పేపర్-2 నుంచి సంబంధింత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పేపర-2 పరీక్ష సమయం 60 నిమిషాలు. పే స్కేల్: నెలకు రూ.19,900- రూ.63,200 చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.04.2025. ➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.05.2025. ➥ ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 13.05.2025. ➥ దరఖాస్తు సవరణ తేదీలు: 14.05.2025 నుంచి 23.05.2025.
Regional Description: 
RRB ALP Notification: రైల్వే శాఖలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, వివరాలు ఇలా RRB ALP Recruitment: రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో 9970 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఆసక్తి గల అభ్యర్థులు మే 11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ అప్లికేషన్ RRB ALP Application 2025: రైల్వేశాఖ దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్ల పరిధిలో అసిస్టెంట్ లోకో పైలట్ (Assistant Loco Pilot) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 9,970 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 12న ప్రారంభం కాగా.. మే 11 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. మూడేళ్ల డిప్లొమా (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌) అర్హత ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. రెండు దశల కంప్యూటర్ ఆధారిత పరీక్ష(స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారికి నెలకు రూ.19,900- రూ.63,200 పే స్కేలు చెల్లిస్తారు. ఆర్‌ఆర్‌బీ రీజియన్లు: అహ్మదాబాద్, అజ్‌మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్‌పూర్, చండీఘడ్‌, చెన్నై, గువాహటి, జమ్ము అండ్‌ శ్రీనగర్, కోల్‌కతా, మాల్దా, ముంబయి, ముజఫర్‌పూర్, పట్నా, ప్రయాగ్‌రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్‌పూర్. వివరాలు.. * అసిస్టెంట్ లోకో పైలట్ (ALP) పోస్టులు ఖాళీల సంఖ్య: 9,970. ఆర్‌ఆర్‌బీ రీజియన్ల వారీగా ఖాళీలు ➥ అహ్మదాబాద్: 497 పోస్టులు ➥ అజ్మీర్: 820 పోస్టులు ➥ ప్రయాగ్‌రాజ్‌: 588 పోస్టులు ➥ భోపాల్‌: 664 పోస్టులు ➥ భువనేశ్వర్: 928 పోస్టులు ➥ బిలాస్‌పూర్: 568 పోస్టులు ➥ చండీఘడ్‌: 433 పోస్టులు ➥ చెన్నై: 362 పోస్టులు ➥ గువాహటి: 30 పోస్టులు ➥ జమ్ము అండ్‌ శ్రీనగర్: 08 పోస్టులు ➥ కోల్‌కతా: 720 పోస్టులు ➥ మాల్దా: 432 పోస్టులు ➥ ముంబయి: 740 పోస్టులు ➥ ముజఫర్‌పూర్: 89 పోస్టులు ➥ పట్నా: 33 పోస్టులు ➥ ప్రయాగ్‌రాజ్: 286 పోస్టులు ➥ రాంచీ: 1,213 పోస్టులు ➥ సికింద్రాబాద్: 1,500 పోస్టులు ➥ సిలిగురి: 95 పోస్టులు ➥ తిరువనంతపురం: 148 పోస్టులు ➥ గోరఖ్‌పూర్: 100 పోస్టులు అర్హత: అభ్యర్థులు మెట్రిక్యులేషన్‌తో పాటు సంబంధిత ట్రేడులో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ లేదా ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా చేసినవారూ దరఖాస్తుకు అర్హులు. వయోపరిమితి: 01.07.2025 నాటికి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు 3 సంవత్సరాలు; ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3-6-8 సంవత్సరాలు; రైల్వేలో గ్రూప్-సి, గ్రూప్-డి విభాగంలో పనిచేస్తున్నవారికి 40-43-45 సంవత్సరాలు; వితంతువులు, ఒంటరి మహిళలకు 35-38-40 సంవత్సరాలు; 25 సంవత్సరాలలోపు ఉండి అప్రెంటిస్ పూర్తిచేసినవారికి 35-38-40 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్‌, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (స్టేజ్-1, స్టేజ్-2), కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా. కంప్యూటర్ ఆధారిత పరీక్ష: స్టేజ్-1 పరీక్ష విధానం.. మొత్తం 75 మార్కులకు స్టేజ్-1 పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 60 నిమిషాలు. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి ⅓ మార్కులు కోత విదిస్తారు. ఇందులో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్, జనరల్ సైన్స్ మరియు కరెంట్ అఫైర్స్ జనరల్ అవేర్‌నెస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. స్టేజ్-2 పరీక్ష విధానం.. మొత్తం 175 మార్కులకు స్టేజ్-2 పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లు కలిపి మొత్తం 175 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. మొత్తం పరీక్ష సమయం 150 నిమిషాలు. ఇందులో పేపర్-1 నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలు ఉంటాయి. వీటిలో మ్యాథమెటిక్స్ 25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ 25 ప్రశ్నలు-25 మార్కులు, బేసిక్ సైన్స్ & ఇంజినీరింగ్ 40 ప్రశ్నలు-40 మార్కులు, జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్ 10 ప్రశ్నలు-10 మార్కులు ఉంటాయి. పేపర్-1 పరీక్ష సమయం 90 నిమిషాలు. ఇక పేపర్-2 నుంచి సంబంధింత ట్రేడ్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు కేటాయించారు. పేపర-2 పరీక్ష సమయం 60 నిమిషాలు. పే స్కేల్: నెలకు రూ.19,900- రూ.63,200 చెల్లిస్తారు. ముఖ్యమైన తేదీలు.. ➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.04.2025. ➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 11.05.2025. ➥ ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరి తేదీ: 13.05.2025. ➥ దరఖాస్తు సవరణ తేదీలు: 14.05.2025 నుంచి 23.05.2025.