News Friday, March 14, 2025 - 09:20
Submitted by andhra on Fri, 2025-03-14 09:20
Select District:
News Items:
Description:
AP Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాల్లో వయోపరిమితి పొడిగింపు - అధికారిక ఉత్తర్వులు జారీ
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 42 ఏళ్లకు పెంచింది.
ఏపీలో వయోపరిమితి పెంపు
Age Limit In Job Recruitment: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి 34 నుంచి 42 ఏళ్లకు, యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే నియామకాలకు వయోపరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. త్వరలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో.. వయోపరిమితిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఏపీపీఎస్సీ సహా అన్ని నియామక ఏజెన్సీలు నిర్వహించే యూనిఫాం సర్వీసు ప్రత్యక్ష నియామకాలకు అర్హత వయస్సును 2 ఏళ్లకు సడలిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 సెప్టెంబర్ 30 తేదీ వరకూ ఈ సడలింపు వర్తిస్తుందని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. యూనిఫాం సర్వీసు కానీ ఇతర ప్రత్యక్ష నియామకాలకు అర్హత వయస్సును 34 నుంచి 42 ఏళ్లకు సడలిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ సహా ఇతర నియామక ఏజెన్సీలు చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ సడలింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ సడలింపు 2025 సెప్టెంబర్ 30 వరకూ వర్తించేలా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ జీవో ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా అన్ని నియామక ఏజెన్సీలకు చెందిన పరీక్షలకు ఈ పెంపు వర్తించనుంది. ఇకపై విడుదలయ్యే నోటిఫికేషన్లకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వయోపరిమితి సడలించాలనే ప్రతిపాదనలు అందాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పెంపు స్టేట్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్కు వర్తించనుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చింది. ఐతే.. హామీల అమలు కొంత ఆలస్యమయ్యేలా ఉంది. అందువల్ల ఉద్యోగం కోసం ఎదురుచూసే వారు, కొత్త ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం చూస్తున్నారు.
16,347 టీచర్ పోస్టుల భర్తీకి 'మెగా డీఎస్సీ'..
ఏపీలో త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ తో భారీ ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీ నాయకులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ అసెంబ్లీలో వెల్లడించిన సంగతి తెలిసిందే.
Regional Description:
AP Jobs: ఏపీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్, ప్రభుత్వ ఉద్యోగాల్లో వయోపరిమితి పొడిగింపు - అధికారిక ఉత్తర్వులు జారీ
ఏపీలోని నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితిని 34 సంవత్సరాల నుంచి 42 ఏళ్లకు పెంచింది.
ఏపీలో వయోపరిమితి పెంపు
Age Limit In Job Recruitment: ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వయోపరిమితిని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. నాన్ యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి 34 నుంచి 42 ఏళ్లకు, యూనిఫామ్ ఉద్యోగాలకు వయోపరిమితి రెండేళ్లు పెంచింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరులో జరిగే నియామకాలకు వయోపరిమితి పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. త్వరలో డీఎస్సీ, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడనున్న నేపథ్యంలో.. వయోపరిమితిని పెంచుతూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
ఏపీపీఎస్సీ సహా అన్ని నియామక ఏజెన్సీలు నిర్వహించే యూనిఫాం సర్వీసు ప్రత్యక్ష నియామకాలకు అర్హత వయస్సును 2 ఏళ్లకు సడలిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 సెప్టెంబర్ 30 తేదీ వరకూ ఈ సడలింపు వర్తిస్తుందని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. యూనిఫాం సర్వీసు కానీ ఇతర ప్రత్యక్ష నియామకాలకు అర్హత వయస్సును 34 నుంచి 42 ఏళ్లకు సడలిస్తూ నోటిఫికేషన్ ఇచ్చింది. ఏపీపీఎస్సీ సహా ఇతర నియామక ఏజెన్సీలు చేపట్టే ప్రత్యక్ష నియామకాలకు ఈ సడలింపు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ సడలింపు 2025 సెప్టెంబర్ 30 వరకూ వర్తించేలా నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ జీవో ప్రకారం.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సహా అన్ని నియామక ఏజెన్సీలకు చెందిన పరీక్షలకు ఈ పెంపు వర్తించనుంది. ఇకపై విడుదలయ్యే నోటిఫికేషన్లకు అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీని అత్యంత ప్రాధాన్య అంశంగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగులు, ప్రజాప్రతినిధుల నుంచి వయోపరిమితి సడలించాలనే ప్రతిపాదనలు అందాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వయోపరిమితి పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. ఈ పెంపు స్టేట్, సబార్డినేట్ సర్వీస్ రూల్స్కు వర్తించనుంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని హామీలు ఇచ్చింది. ఐతే.. హామీల అమలు కొంత ఆలస్యమయ్యేలా ఉంది. అందువల్ల ఉద్యోగం కోసం ఎదురుచూసే వారు, కొత్త ప్రభుత్వ నోటిఫికేషన్ల కోసం చూస్తున్నారు.
16,347 టీచర్ పోస్టుల భర్తీకి 'మెగా డీఎస్సీ'..
ఏపీలో త్వరలోనే మెగా డిఎస్సీ నోటిఫికేషన్ తో భారీ ఎత్తున టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపక్ష పార్టీ నాయకులు అడిగిన ప్రశ్నలకు మంత్రి లోకేష్ అసెంబ్లీలో వెల్లడించిన సంగతి తెలిసిందే.