News Wednesday, March 22, 2017 - 10:12

News Items: 
Description: 
Government proposed Rs 2 lakh cash transaction limit : The government on Tuesday proposed to reduce the cap on cash transactions to Rs 2 lakh, down from Rs 3 lakh as announced in the Union Budget. A penalty of equal amount would be levied in case of violation of the provision, a tweet by revenue secretary Hasmukh Adhia said after the amendment was moved. Finance Minister Arun Jaitley had in his Budget speech announced that on the recommendation of the Special Investigation Team (SIT) on Black Money, the government had decided not to allow cash transactions above Rs 3 lakh.
Regional Description: 
రూ. 2 లక్షల పైబడిన నగదు లావాదేవీలకు చెక్ : నల్లధనాన్ని అరికట్టడం కోసం నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తోన్న ప్రభుత్వం ఈ దిశగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా.. నగదు లావాదేవీలను రూ. 2 లక్షలకు పరిమితం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం ఫైనాన్స్ బిల్లు 2017కు సవరణలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ. 2 లక్షలకు మించి నగదు లావాదేవీలు నిర్వహిస్తే.. భారీగా జరిమానా విధించే దిశగా కేంద్రం ఈ బిల్లుకు మార్పులు చేస్తోంది. ప్రస్తుతం ఈ బిల్లు విషయమై లోక్‌సభలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ నిబంధనను ఉల్లంఘిస్తే.. లావాదేవీకి సమానంగా జరిమానా విధించనున్నట్లు రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అదియా ట్వీట్ చేశారు. వాస్తవానికి నగదు లావాదేవీలను రూ. 3 లక్షలకు పరిమితం చేస్తున్నట్లు బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మార్చి 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రాగా.. ఇప్పుడు దాన్ని రూ. 2 లక్షలకు పరిమితం చేసేలా ప్రభుత్వం చర్యలు ఉండటం గమనార్హం. నగదు రహిత సమాజమే లక్ష్యంగా ముందడుగేస్తున్న కేంద్రం.. బడ్జెట్ సందర్భంగా ఆదాయపన్ను చట్టంలో సెక్షన్ 269ఎస్‌టీని చేర్చింది. దీని ప్రకారం ఏ వ్యక్తి కూడా ఒక్క రోజులో రూ. 3 లక్షలు లేదా అంత కంటే ఎక్కువ మొత్తాన్ని నగదు రూపంలో తీసుకోవడం కుదరదు. ఒకే లావాదేవీ ద్వారా కూడా ఇంత మొత్తాన్ని తీసుకోలేరు. అయితే ఈ నిబంధనలు ప్రభుత్వాలకు, బ్యాంకింగ్ రంగ సంస్థలు, పోస్టాఫీస్ సేవింగ్స్ బ్యాంక్‌లు, కోఆపరేటివ్ బ్యాంకులకు వర్తించవు. పరిమితికి మించి లావాదేవీలు నిర్వహిస్తే.. అందుకు సమాన మొత్తంలో పెనాల్టీని చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ తాజా చర్యలతో ఈ పరిమితి రూ. 2 లక్షలకు తగ్గనుంది.