News Tuesday, November 12, 2024 - 08:58
Submitted by andhra on Tue, 2024-11-12 08:58
Select District:
News Items:
Description:
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో నెమ్మదిగా తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో నవంబర్ 2024 మంగళ, బుధ,గురువారాల్లో(12,13,14 తేదీల్లో) రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.-ఏపీ విపత్తుల సంస్థ.
Regional Description:
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది రెండు రోజుల్లో నెమ్మదిగా తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదిలేందుకు అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర నుండి పశ్చిమమధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి విస్తరించి ఉంది.
దీని ప్రభావంతో నవంబర్ 2024 మంగళ, బుధ,గురువారాల్లో(12,13,14 తేదీల్లో) రాయలసీమ, దక్షిణకోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
వర్షాల నేపథ్యంలో వరి కోతలు, ఇతర వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.-ఏపీ విపత్తుల సంస్థ.