News Tuesday, October 22, 2024 - 10:08

Select District: 
News Items: 
Description: 
స్వర్ణాంద్ర ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. విజయవాడ ఏపీలో పనిచేయాలి.. నెలకు రూ.75 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు జీతం Government of Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ జాబ్‌ ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు కోరుతోంది. వివరాల్లోకెళ్తే.. • ఏపీఎస్‌డీపీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2024 • ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీ • అక్టోబర్‌ 29 దరఖాస్తులకు చివరితేది ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ APSDPS Job Notification 2024 : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్వర్ణాంధ్ర@2047 విజన్‌ ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.apsdps.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. మొత్తం పోస్టులు : 13 • ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్ పోస్టులు : 04 • కన్సల్టెంట్/ రిసెర్చ్ అసోసియేట్స్‌ పోస్టులు : 08 • డేటాబేస్ డెవలపర్ పోస్టులు : 01 నోటిఫికేషన్‌ ఇతర ముఖ్య సమాచారం : • అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (కంప్యూటర్స్‌), పీజీ లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసీ/ ఎకనామిక్స్‌/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ ఇంజినీరింగ్/ డెవలప్‌మెంట్ స్టడీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. • జీతం: నెలకు ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు రూ.2,00,000- రూ.2.5 లక్షలు.. కన్సల్టెంట్ పోస్టులకు రూ.75,000 - రూ.1.50,000.. డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45,000 - రూ.75,000 వేతనం ఉంటుంది. • వయోపరిమితి: 01-01-2025 నాటికి ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు 55 ఏళ్లు.. కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు,, డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. • పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. • ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. • దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్‌ 29, 2024
Regional Description: 
స్వర్ణాంద్ర ప్రాజెక్ట్‌లో ఉద్యోగాలు.. విజయవాడ ఏపీలో పనిచేయాలి.. నెలకు రూ.75 వేల నుంచి రూ.2.5 లక్షల వరకు జీతం Government of Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ జాబ్‌ ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తులు కోరుతోంది. వివరాల్లోకెళ్తే.. • ఏపీఎస్‌డీపీఎస్‌ రిక్రూట్‌మెంట్‌ 2024 • ఒప్పంద ప్రాతిపదికన 13 పోస్టుల భర్తీ • అక్టోబర్‌ 29 దరఖాస్తులకు చివరితేది ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ APSDPS Job Notification 2024 : విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ జాబ్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్వర్ణాంధ్ర@2047 విజన్‌ ప్రాజెక్ట్ కోసం ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్‌ 29 దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలకు http://www.apsdps.ap.gov.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి. మొత్తం పోస్టులు : 13 • ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్ పోస్టులు : 04 • కన్సల్టెంట్/ రిసెర్చ్ అసోసియేట్స్‌ పోస్టులు : 08 • డేటాబేస్ డెవలపర్ పోస్టులు : 01 నోటిఫికేషన్‌ ఇతర ముఖ్య సమాచారం : • అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (కంప్యూటర్స్‌), పీజీ లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసీ/ ఎకనామిక్స్‌/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ ఇంజినీరింగ్/ డెవలప్‌మెంట్ స్టడీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. • జీతం: నెలకు ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు రూ.2,00,000- రూ.2.5 లక్షలు.. కన్సల్టెంట్ పోస్టులకు రూ.75,000 - రూ.1.50,000.. డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45,000 - రూ.75,000 వేతనం ఉంటుంది. • వయోపరిమితి: 01-01-2025 నాటికి ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు 55 ఏళ్లు.. కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు,, డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు. • పని ప్రదేశం: ఆంధ్రప్రదేశ్‌ విజయవాడలో పని చేయాల్సి ఉంటుంది. • ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో అప్లయ్‌ చేసుకోవాలి. • దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్‌ 29, 2024