News Thursday, September 12, 2024 - 22:33

News Items: 
Description: 
AP Social Media Assistant Jobs: ఏపీ రాష్ట్ర మంత్రుల పేషీల్లో ‘సోషల్‌ మీడియా’ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌’, ‘సోషల్‌ మీడియా అసిస్టెంట్‌’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. అమరావతి, సెప్టెంబర్‌ 12: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌’, ‘సోషల్‌ మీడియా అసిస్టెంట్‌’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 మంది సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌లను, 24 మంది సోషల్‌ మీడియా అసిస్టెంట్‌లను ఈ నోటిఫికేషన్‌ కింద నియమించనుంది. ఈ పోస్టులను అవుట్‌సోర్సింగ్‌/తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌కి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు విద్యార్హతలు ఏమేం ఉండాలంటే.. బీఈ, బీటెక్‌తోపాటు సోషల్‌ మీడియాపై అవగాహన ఉండాలని నిర్ణయించారు. వీరికి నెలకు రూ.50 వేల చొప్పున వేతనంగా చెల్లిస్తారు. సోషల్‌ మీడియా అసిస్టెంట్‌ పోస్టులకి విద్యార్హత.. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వీరికి నెలకు రూ.30 వేల చొప్పున జీతం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు లేటెస్ట్ రెజ్యూమేను info.apdcl@gmail.com ఐడీకి ఈమెయిల్ చేయాలి. సెప్టెంబర్‌ 23, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర వివరాలకు https://www.apdc.ap.gov.in/ , http://ipr.ap.gov.in/ వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు. తెలంగాణ అగ్రిసెట్‌-2024 ఫలితాల విడుదల.. త్వరలోనే కౌన్సెలింగ్‌ ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌- 2024 ఫలితాలను రిజిస్ట్రార్‌ రఘురామిరెడ్డి విడుదల చేశారు. అగ్రిసెట్, ఇంజినీరింగ్‌ సెట్‌లలో వచ్చిన ర్యాంకు ఆధారంగా.. వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులు నేరుగా వ్యవసాయ బీఎస్సీ, వ్యవసాయ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్షలు ఆగస్టు 24న నిర్వహించగా.. తాజాగా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వ్యవసాయ బీఎస్సీలో 92, ఇంజినీరింగ్‌లో 8 చొప్పున సీట్లు వర్సిటీలో అందుబాటులో ఉన్నాయి
Regional Description: 
AP Social Media Assistant Jobs: ఏపీ రాష్ట్ర మంత్రుల పేషీల్లో ‘సోషల్‌ మీడియా’ పోస్టులకు నోటిఫికేషన్‌.. ఎలాంటి రాత పరీక్ష లేదు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌’, ‘సోషల్‌ మీడియా అసిస్టెంట్‌’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. అమరావతి, సెప్టెంబర్‌ 12: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్ర మంత్రుల పేషీల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ‘సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌’, ‘సోషల్‌ మీడియా అసిస్టెంట్‌’ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ డిజిటల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీడీసీ) ఈ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 24 మంది సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌లను, 24 మంది సోషల్‌ మీడియా అసిస్టెంట్‌లను ఈ నోటిఫికేషన్‌ కింద నియమించనుంది. ఈ పోస్టులను అవుట్‌సోర్సింగ్‌/తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. సోషల్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌కి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు విద్యార్హతలు ఏమేం ఉండాలంటే.. బీఈ, బీటెక్‌తోపాటు సోషల్‌ మీడియాపై అవగాహన ఉండాలని నిర్ణయించారు. వీరికి నెలకు రూ.50 వేల చొప్పున వేతనంగా చెల్లిస్తారు. సోషల్‌ మీడియా అసిస్టెంట్‌ పోస్టులకి విద్యార్హత.. ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. వీరికి నెలకు రూ.30 వేల చొప్పున జీతం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు లేటెస్ట్ రెజ్యూమేను info.apdcl@gmail.com ఐడీకి ఈమెయిల్ చేయాలి. సెప్టెంబర్‌ 23, 2024వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇతర వివరాలకు https://www.apdc.ap.gov.in/ , http://ipr.ap.gov.in/ వెబ్‌సైట్‌లను సందర్శించవచ్చు. తెలంగాణ అగ్రిసెట్‌-2024 ఫలితాల విడుదల.. త్వరలోనే కౌన్సెలింగ్‌ ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహించిన అగ్రిసెట్, అగ్రి ఇంజినీరింగ్‌ సెట్‌- 2024 ఫలితాలను రిజిస్ట్రార్‌ రఘురామిరెడ్డి విడుదల చేశారు. అగ్రిసెట్, ఇంజినీరింగ్‌ సెట్‌లలో వచ్చిన ర్యాంకు ఆధారంగా.. వ్యవసాయ పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులు నేరుగా వ్యవసాయ బీఎస్సీ, వ్యవసాయ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో రెండో సంవత్సరంలో చేరేందుకు అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్షలు ఆగస్టు 24న నిర్వహించగా.. తాజాగా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల మెరిట్‌ జాబితాను వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. వ్యవసాయ బీఎస్సీలో 92, ఇంజినీరింగ్‌లో 8 చొప్పున సీట్లు వర్సిటీలో అందుబాటులో ఉన్నాయి