News Friday, August 23, 2024 - 10:22

News Items: 
Description: 
SSC JE Results: ఎస్‌ఎస్‌సీ 'జూనియర్ ఇంజినీర్' పేపర్-1 ఫలితాలు విడుదల, తర్వాతి దశకు 16,223 మంది అర్హత SSC JE Results: కేంద్ర శాఖల్లో వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. పేపర్-1 పరీక్షలో మొత్తం 16,223 మంది అర్హత సాధించారు. జూనియర్ ఇంజినీర్ పేపర్-1 ఫలితాలు SSC Junior Engineer Paper-1 Results: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పేపర్‌-1 రాతపరీక్ష ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆగస్టు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో పేపర్-1 రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రూల్ నెంబరు, పేరు వివరాలను పొందుపరిచింది. ఫలితాలకు సంబంధించి పేపర్-1 పరీక్షలో మొత్తం 16,223 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 11,765 మంది అభ్యర్థులు; ఎలక్ట్రికల్/మెకానికల్ విభాగాల్లో 4,458 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్షకు అర్హత సాధించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో 1,765 జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 28 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. తాజా పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. జూన్ 5 నంచి 7 వరకు పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఇస్తారు. పేపర్‌-1 పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో పేపర్‌-2 రాతపరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
Regional Description: 
SSC JE Results: ఎస్‌ఎస్‌సీ 'జూనియర్ ఇంజినీర్' పేపర్-1 ఫలితాలు విడుదల, తర్వాతి దశకు 16,223 మంది అర్హత SSC JE Results: కేంద్ర శాఖల్లో వివిధ విభాగాల్లో జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. పేపర్-1 పరీక్షలో మొత్తం 16,223 మంది అర్హత సాధించారు. జూనియర్ ఇంజినీర్ పేపర్-1 ఫలితాలు SSC Junior Engineer Paper-1 Results: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పేపర్‌-1 రాతపరీక్ష ఫలితాలను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆగస్టు 20న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచింది. పీడీఎఫ్ ఫార్మాట్‌లో పేపర్-1 రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల రూల్ నెంబరు, పేరు వివరాలను పొందుపరిచింది. ఫలితాలకు సంబంధించి పేపర్-1 పరీక్షలో మొత్తం 16,223 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో 11,765 మంది అభ్యర్థులు; ఎలక్ట్రికల్/మెకానికల్ విభాగాల్లో 4,458 మంది అభ్యర్థులు పేపర్-2 పరీక్షకు అర్హత సాధించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో 1,765 జూనియర్‌ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి మార్చి 28 నుంచి ఏప్రిల్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించారు. తాజా పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌కార్డులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెల్లడించింది. జూన్ 5 నంచి 7 వరకు పరీక్షలు నిర్వహించారు. తాజాగా ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. ఉద్యోగాలకు ఎంపికైన వారికి సెవెన్త్‌ పే స్కేలు ప్రకారం రూ.35,400- రూ.1,12,400 జీతం ఇస్తారు. పేపర్‌-1 పరీక్షలో అర్హత సాధించినవారికి తర్వాతి దశలో పేపర్‌-2 రాతపరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.