News Wednesday, June 28, 2023 - 10:00

Select District: 
News Items: 
Description: 
Teacher Jobs: 1.78 లక్షల టీచర్‌ ఉద్యోగాలు, అందరూ అర్హులే! నితీశ్ సర్కారు కీలక నిర్ణయం బిహార్‌లోని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో టీచర్ పోస్టులకు అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.. బిహార్‌లో 1.78 లక్షల టీచర్ పోస్టులు బిహార్‌లోని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. మంగళవారం నీతీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు కేబినెట్ సెక్రటేరియట్ అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్.సిద్దార్థ్ వెల్లడించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సర్వీస్ నిబంధనల ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బిహార్ వాసులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకొనేవారు. అయితే, తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండదని సిద్ధార్థ్ తెలిపారు. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ పౌరులు ఎవరైనా బిహార్‌లోని 1.78లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 1.78 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మే 2న బిహార్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఉద్యోగాల్లో 85,477 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉండగా.. 1,745 మాధ్యమిక, 90,804 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు.
Regional Description: 
Teacher Jobs: 1.78 లక్షల టీచర్‌ ఉద్యోగాలు, అందరూ అర్హులే! నితీశ్ సర్కారు కీలక నిర్ణయం బిహార్‌లోని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో టీచర్ పోస్టులకు అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.. బిహార్‌లో 1.78 లక్షల టీచర్ పోస్టులు బిహార్‌లోని సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో భారీ సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులకు భర్తీకి అర్హత కలిగిన ఏ రాష్ట్రం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది. మంగళవారం నీతీశ్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో విద్యాశాఖ చేసిన ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు కేబినెట్ సెక్రటేరియట్ అదనపు చీఫ్ సెక్రటరీ ఎస్.సిద్దార్థ్ వెల్లడించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త సర్వీస్ నిబంధనల ప్రకారం గతంలో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో బిహార్ వాసులను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించుకొనేవారు. అయితే, తాజాగా కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఉద్యోగ నియామకానికి నివాస ఆధారిత రిజర్వేషన్ ఏమీ ఉండదని సిద్ధార్థ్ తెలిపారు. రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో భారతీయ పౌరులు ఎవరైనా బిహార్‌లోని 1.78లక్షల ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్కూళ్లలో ఖాళీగా ఉన్న 1.78 లక్షల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు మే 2న బిహార్ మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. మొత్తం ఉద్యోగాల్లో 85,477 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉండగా.. 1,745 మాధ్యమిక, 90,804 ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఏడాది చివరి నాటికి భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు సీనియర్ అధికారులు తెలిపారు.