News Tuesday, April 11, 2023 - 11:32
Submitted by andhra on Tue, 2023-04-11 11:32
Select District:
News Items:
Description:
చేపలవేట నిషేధం...... ఆంధ్రప్రదేశ్లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ శ్రీ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు (మెకనైజ్డ్, మోటారు బోట్ల) ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు.. నిషేధం విధించారు. అంటే మొత్తం 61 రోజుల పాటు చేపల వేటను నిషేధించామని.. ఈ మేరకు 6వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు.
సముద్ర జలాల్లో చేపల వేట నిషేధానికి ముఖ్య ఉద్దేశ్యం వివిధ చేప రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలను రొయ్యలను సంరక్షించడం. వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం తద్వారా సముద్ర మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు (మెకనైజ్డ్ , మోటారు బోట్లు) పై మత్స్య కారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని కోరారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపలవేట చేసిన యెడల ఆయా బోటు యజమానులను ఆంధ్రప్రదేశ్ మత్స్య క్రమబద్దీకరణ చట్టం (AP MFR Act) 1994 అనుసరించి శిక్షార్హులు, అట్టివారి బోట్లను బోట్లలో ఉండే మత్స్యసంపదను స్వాధీన పరుచుకునుటయే కాక జరిమానా విధిస్తూ డీజిల్ సబ్సిడీ మరియు ప్రభుత్వం అందించే అన్ని రకాల సబ్సిడీలను నిలుపుదల చేయబడునని తెలియచేయడమైనది.
Regional Description:
చేపలవేట నిషేధం...... ఆంధ్రప్రదేశ్లోని ప్రాదేశిక సముద్ర జలాల్లో చేపల వేట 61 రోజులపాటు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ శ్రీ కె. కన్నబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాదేశిక సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు (మెకనైజ్డ్, మోటారు బోట్ల) ద్వారా నిర్వహించే అన్ని రకాల చేపల వేటను ఏప్రిల్ 15వ తేదీ నుండి జూన్ 14వ తేదీ వరకు.. నిషేధం విధించారు. అంటే మొత్తం 61 రోజుల పాటు చేపల వేటను నిషేధించామని.. ఈ మేరకు 6వ తేదీన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు.
సముద్ర జలాల్లో చేపల వేట నిషేధానికి ముఖ్య ఉద్దేశ్యం వివిధ చేప రొయ్య జాతుల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలను రొయ్యలను సంరక్షించడం. వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం తద్వారా సముద్ర మత్స్య సంపద అభివృద్ధికి కృషి చేయడమేనని ఆయన పేర్కొన్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను అనుసరించి సముద్ర జలాల్లో యాంత్రిక పడవలు (మెకనైజ్డ్ , మోటారు బోట్లు) పై మత్స్య కారులు ఎటువంటి చేపల వేట చేయకుండా మత్స్య అభివృద్ధికి సహకరించాలని కోరారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి చేపలవేట చేసిన యెడల ఆయా బోటు యజమానులను ఆంధ్రప్రదేశ్ మత్స్య క్రమబద్దీకరణ చట్టం (AP MFR Act) 1994 అనుసరించి శిక్షార్హులు, అట్టివారి బోట్లను బోట్లలో ఉండే మత్స్యసంపదను స్వాధీన పరుచుకునుటయే కాక జరిమానా విధిస్తూ డీజిల్ సబ్సిడీ మరియు ప్రభుత్వం అందించే అన్ని రకాల సబ్సిడీలను నిలుపుదల చేయబడునని తెలియచేయడమైనది.