News Friday, April 7, 2023 - 10:39
Submitted by andhra on Fri, 2023-04-07 10:39
Select District:
News Items:
Description:
మిషన్ వాత్సల్య అంటే ఏంటో తెలుసా..? పూర్తి వివరాలివే.....
చాలా మందికి పేదరికం ఓ సమస్య. కొంత మంది తల్లిదండ్రులు లేక, మరికొంత మంది ఎవరూ లేక అనాథలుగా పెరుగుతున్నారు. పరామర్శలకు వెళ్లి నాయకులు సైతం తాత్కాలిక సాయాన్ని మాత్రమే అందించగలరు. మరీ తర్వాత వారి పరిస్థితి ఏంటి అంటే. ఒక్కరి నుండి సమాధానం ఉండదు. సమాజంలో జాలి మాత్రమే చూపించే రోజులు. ఆర్థికంగా ఆదుకోవాలంటే ఆలోచించాల్సిందే. ఇలాంటి వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఓ పథకం ఇది. అనాథలు, నిస్సహాయ స్థితిలో ఉన్న బాలబాలికలకు ఆరోగ్యంతో పాటు ఆర్ధికభరోసా కల్పించేం దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 'మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద అర్హులైన వారికి ప్రతినెలా రూ.4 వేలు అందజేస్తారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం ఈ పథకం నిర్వాహణ చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం 60 శాతం అంటే రూ.2400 కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రూ.1600 నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు. ఈ పథకం నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారి చదువును కొన సాగించేందుకు దోహదపడుతుంది.
తల్లిదండ్రులను కోల్పోయి ఇతర కుటుంబాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు, కొవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయినవారు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులు, హింస, దోపిడీకి గురవుతున్న పిల్లలు, పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకంలో లబ్ధిపొందుతున్న చిన్నారులు, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడి, శారీరకంగా సమర్థత కోల్పోయి పిల్లలను పెంచలేనివారు, న్యాయ ఆదరణ, సంరక్షణ చట్టం-2015 ప్రకారం గుర్తించిన బాల కార్మికులు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాల యాచకులు, పునరావాసం కోసం ఎదురుచూసే బాలికలు, తల్లి వితంతువై లేదా విడాకులు తీసుకుని కుటుం విడిచిపెట్టి ఉంటున్న వారి పిల్లలు, గ్రామాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.72 వేల లోపు, పట్టణ ప్రాంతంలో రూ.96 వేలు మించని వారి పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు.
తల్లి లేదా తండ్రి చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రం, భార్యాభర్తలు విడాకులు పొంది విడిగా ఉన్నట్లయితే వీఆర్వో నుంచి ధ్రువపత్రం, తల్లిదం డ్రులు, పిల్లల ఆధార్ కార్డులు, బాలల పుట్టిన తేదీ ధ్రువపత్రం, పాస్ పోర్టు సైజు ఫొటోలు, విద్యార్ధి స్టడీ సర్టిఫికెట్, తల్లి, తండ్రి, సంరక్షకుడితో పాటు పిల్లలతో జాయింట్ బ్యాంకు ఖాతా లేదా బిడ్డ పేరున ఖాతా, ఇద్దరు పిల్లలుంటే రెండు ఖాతాలు తెరవాలి. ఇప్పటికే దీనిపై ఓ సర్వే నిర్వహిస్తున్నామని, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో సర్వే చేపట్టామని. అర్హులైన వారు స్థానిక అంగన్ వాడీ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
Regional Description:
మిషన్ వాత్సల్య అంటే ఏంటో తెలుసా..? పూర్తి వివరాలివే.....
చాలా మందికి పేదరికం ఓ సమస్య. కొంత మంది తల్లిదండ్రులు లేక, మరికొంత మంది ఎవరూ లేక అనాథలుగా పెరుగుతున్నారు. పరామర్శలకు వెళ్లి నాయకులు సైతం తాత్కాలిక సాయాన్ని మాత్రమే అందించగలరు. మరీ తర్వాత వారి పరిస్థితి ఏంటి అంటే. ఒక్కరి నుండి సమాధానం ఉండదు. సమాజంలో జాలి మాత్రమే చూపించే రోజులు. ఆర్థికంగా ఆదుకోవాలంటే ఆలోచించాల్సిందే. ఇలాంటి వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఓ పథకం ఇది. అనాథలు, నిస్సహాయ స్థితిలో ఉన్న బాలబాలికలకు ఆరోగ్యంతో పాటు ఆర్ధికభరోసా కల్పించేం దుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 'మిషన్ వాత్సల్య పథకాన్ని అమలు చేస్తున్నాయి. ఈ పథకం కింద అర్హులైన వారికి ప్రతినెలా రూ.4 వేలు అందజేస్తారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, బాలల సంరక్షణ విభాగం ఈ పథకం నిర్వాహణ చేస్తోంది. ఈ పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం 60 శాతం అంటే రూ.2400 కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రూ.1600 నిధులు సమకూర్చి అనాథ పిల్లలకు అందజేయనున్నారు. ఈ పథకం నిస్సహాయ స్థితిలో ఉన్న కుటుంబాల పిల్లల సంరక్షణతో పాటు వారి చదువును కొన సాగించేందుకు దోహదపడుతుంది.
తల్లిదండ్రులను కోల్పోయి ఇతర కుటుంబాల్లో ఆశ్రయం పొందుతున్న చిన్నారులు, కొవిడ్ తో తల్లిదండ్రులను కోల్పోయినవారు, హెచ్ఐవీ బాధితులు, దివ్యాంగులు, హింస, దోపిడీకి గురవుతున్న పిల్లలు, పీఎం కేర్ ఫర్ చిల్డ్రన్ పథకంలో లబ్ధిపొందుతున్న చిన్నారులు, ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తల్లిదండ్రుల పిల్లలు, తల్లిదండ్రులు ఆర్థికంగా వెనుకబడి, శారీరకంగా సమర్థత కోల్పోయి పిల్లలను పెంచలేనివారు, న్యాయ ఆదరణ, సంరక్షణ చట్టం-2015 ప్రకారం గుర్తించిన బాల కార్మికులు, ఇంటి నుంచి పారిపోయి వచ్చిన బాల యాచకులు, పునరావాసం కోసం ఎదురుచూసే బాలికలు, తల్లి వితంతువై లేదా విడాకులు తీసుకుని కుటుం విడిచిపెట్టి ఉంటున్న వారి పిల్లలు, గ్రామాల్లో కుటుంబ వార్షిక ఆదాయం రూ.72 వేల లోపు, పట్టణ ప్రాంతంలో రూ.96 వేలు మించని వారి పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు.
తల్లి లేదా తండ్రి చనిపోతే మరణ ధ్రువీకరణ పత్రం, భార్యాభర్తలు విడాకులు పొంది విడిగా ఉన్నట్లయితే వీఆర్వో నుంచి ధ్రువపత్రం, తల్లిదం డ్రులు, పిల్లల ఆధార్ కార్డులు, బాలల పుట్టిన తేదీ ధ్రువపత్రం, పాస్ పోర్టు సైజు ఫొటోలు, విద్యార్ధి స్టడీ సర్టిఫికెట్, తల్లి, తండ్రి, సంరక్షకుడితో పాటు పిల్లలతో జాయింట్ బ్యాంకు ఖాతా లేదా బిడ్డ పేరున ఖాతా, ఇద్దరు పిల్లలుంటే రెండు ఖాతాలు తెరవాలి. ఇప్పటికే దీనిపై ఓ సర్వే నిర్వహిస్తున్నామని, కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలో సర్వే చేపట్టామని. అర్హులైన వారు స్థానిక అంగన్ వాడీ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకో వచ్చు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.