News Friday, March 3, 2017 - 10:12

News Items: 
Description: 
Foreigners came to Kakinada to observe the latest technologies using by fishermen in Marine sector సముద్రంలో సాంకేతికతపై విదేశీబృందం పరిశీలన : సముద్రంలో చేపలవేటకు వెళ్ళే మత్స్యకారులు అవలంబిస్తున్న సాంకేతిక పరిఘ్నానం, జియో ట్రాకింగ్ అంశాలపై ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ (IBM) సంస్థ తరపున విదేశీ బృందం గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. కాకినాడ ఫిషింగ్ హార్భరు, ఉప్పాడ, కుంబాభిషేకం తీరప్రాంత గ్రామాలను పరిశీలించింది. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ డిడి ఎస్. అంజలిగారితో భేటీ అయ్యారు. బృంద సభ్యులు మాట్లాడుతూ రుమేనియా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలతో పోలిస్తే ఇక్కడ అనుసరిస్తున్న సాంకేతిక పరిఘ్నానం కొంతమేర బాగానే ఉందని అయితే సముద్రంలో వేటకు వెళ్ళే బోట్ల విషయంలో చేనా, జపాన్ తో పాటు మరికొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో సాంకేతిక పరిఘ్నానంతో దూసుకుపోతున్నారు. అక్కడి ప్రదేశాలను సందర్శించడం, వారి సాంకేతిక సలహాలను అందిపుచ్చుకుని ఇక్కడ పరిస్థితులను అన్వయించుకోవడం ద్వారా ఇక్కడ కూడా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అమెరికా, చెక్ రిపబ్లిక్ మరియు రుమేనియా నుంచి వచ్చిన బృంద సభ్యలు తెలిపారు. అనంతరం మత్స్యశాఖ డిడి అంజలి మాట్లాడుతూ ఇటీవలన విజయవాడలో జరిగిన సదస్సులో తీరప్రాంతంలో మత్స్యకారులకు సాంకేతిక అంశాలు అందించడంపై తూర్పుగోదావరి జిల్లాను ఎంచుకుని బృందం అధ్యయనం చేసిందని, పరిశీలించిన అంశాలపై వారం రోజులలో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు.
Regional Description: 
సముద్రంలో సాంకేతికతపై విదేశీబృందం పరిశీలన : సముద్రంలో చేపలవేటకు వెళ్ళే మత్స్యకారులు అవలంబిస్తున్న సాంకేతిక పరిఘ్నానం, జియో ట్రాకింగ్ అంశాలపై ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్ (IBM) సంస్థ తరపున విదేశీ బృందం గురువారం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించింది. కాకినాడ ఫిషింగ్ హార్భరు, ఉప్పాడ, కుంబాభిషేకం తీరప్రాంత గ్రామాలను పరిశీలించింది. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ డిడి ఎస్. అంజలిగారితో భేటీ అయ్యారు. బృంద సభ్యులు మాట్లాడుతూ రుమేనియా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలతో పోలిస్తే ఇక్కడ అనుసరిస్తున్న సాంకేతిక పరిఘ్నానం కొంతమేర బాగానే ఉందని అయితే సముద్రంలో వేటకు వెళ్ళే బోట్ల విషయంలో చేనా, జపాన్ తో పాటు మరికొన్ని అభివృద్ధి చెందిన దేశాలలో సాంకేతిక పరిఘ్నానంతో దూసుకుపోతున్నారు. అక్కడి ప్రదేశాలను సందర్శించడం, వారి సాంకేతిక సలహాలను అందిపుచ్చుకుని ఇక్కడ పరిస్థితులను అన్వయించుకోవడం ద్వారా ఇక్కడ కూడా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని అమెరికా, చెక్ రిపబ్లిక్ మరియు రుమేనియా నుంచి వచ్చిన బృంద సభ్యలు తెలిపారు. అనంతరం మత్స్యశాఖ డిడి అంజలి మాట్లాడుతూ ఇటీవలన విజయవాడలో జరిగిన సదస్సులో తీరప్రాంతంలో మత్స్యకారులకు సాంకేతిక అంశాలు అందించడంపై తూర్పుగోదావరి జిల్లాను ఎంచుకుని బృందం అధ్యయనం చేసిందని, పరిశీలించిన అంశాలపై వారం రోజులలో ప్రభుత్వానికి నివేదిక పంపుతామని తెలిపారు.