News Tuesday, February 28, 2017 - 11:47
Submitted by andhra on Tue, 2017-02-28 11:47
Select District:
News Items:
Description:
తీరప్రాంతాల అభివృద్ధికి దారి : రాష్ట్రంలోని కత్తిపూడి-ఒంగోలు మధ్య తీర ప్రాంతాల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించనున్న రహదారి విస్తరణ మొదటిదశ పనులు వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా 5 ప్యాకేజీలలో 225 కి.మీ పొడవునా రెండేళ్ళ క్రితం చేపట్టిన పనులు ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నవి. తీర ప్రాంతాల నుంచి వాణిజ్య ఉత్పతుతల, మత్స్య సంపద సమగ్ర రవాణా, ప్రతిపాదిత ఓడరేవుల నుంచి వస్తు ఎగుమతుల, దిగుమతుల, రవాణా కోసం జాతీయ రహదారిలో కత్తిపూడి నుంచి ఒంగోలు మధ్య రూ. 3,800 కోట్లతో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2015లో ఈ పనులు ప్రారంభించింది. ప్రత్యేకించి కాకినాడ, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల, చీరాల మొదలైన పట్టణాలలో బైపాస్ రహదారులు కొత్తగా రానున్నవి. ఈ రహదారి తయారైన తరువాత జాతీయ రహదారి (నం. 16) పై రద్దీ తగ్గే అవకాశం ఉంది.
Regional Description:
తీరప్రాంతాల అభివృద్ధికి దారి : రాష్ట్రంలోని కత్తిపూడి-ఒంగోలు మధ్య తీర ప్రాంతాల అభివృద్ధిలో ప్రధాన భూమిక పోషించనున్న రహదారి విస్తరణ మొదటిదశ పనులు వచ్చే ఏడాది పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల మీదుగా 5 ప్యాకేజీలలో 225 కి.మీ పొడవునా రెండేళ్ళ క్రితం చేపట్టిన పనులు ప్రస్తుతం వివిధ దశలలో ఉన్నవి. తీర ప్రాంతాల నుంచి వాణిజ్య ఉత్పతుతల, మత్స్య సంపద సమగ్ర రవాణా, ప్రతిపాదిత ఓడరేవుల నుంచి వస్తు ఎగుమతుల, దిగుమతుల, రవాణా కోసం జాతీయ రహదారిలో కత్తిపూడి నుంచి ఒంగోలు మధ్య రూ. 3,800 కోట్లతో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ 2015లో ఈ పనులు ప్రారంభించింది. ప్రత్యేకించి కాకినాడ, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, నరసాపురం, మచిలీపట్నం, రేపల్లె, బాపట్ల, చీరాల మొదలైన పట్టణాలలో బైపాస్ రహదారులు కొత్తగా రానున్నవి. ఈ రహదారి తయారైన తరువాత జాతీయ రహదారి (నం. 16) పై రద్దీ తగ్గే అవకాశం ఉంది.