Disaster Alerts 24/05/2021

State: 
Andhra Pradesh
Message: 
తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాలలో ఉన్న వాయుగుండం మే 24 వ తేదీ “యాస్” తుఫానుగా మారినది. ప్రస్తుతం ఇది పారాదీపుకు తూర్పు ఆగ్నేయంగా 530 దూరంలో ఉన్నది. ఇది ఉత్తర మరియు వాయువ్య దిశగా కదులుతూ మరో 24 గంటలలో తీవ్రమైన తుఫానుగా మారనుంది. ఒడిషాలోని పారాదీప్ మరియు పశ్చమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్ మధ్యలో మే 26వ తేదీ ఉదయం తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా మే 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ముఖ్యంగా విశాఖపట్నం నుండి బారువా తీరం వరకు సముద్రంలో అలలు 8 నుంచి 12 అడుగుల వరకు ఎగిసిపడడంతో పాటు గాలులు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయి. మరియు కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Disaster Type: 
State id: 
1
Disaster Id: 
2
Message discription: 
తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాలలో ఉన్న వాయుగుండం మే 24 వ తేదీ “యాస్” తుఫానుగా మారినది. ప్రస్తుతం ఇది పారాదీపుకు తూర్పు ఆగ్నేయంగా 530 దూరంలో ఉన్నది. ఇది ఉత్తర మరియు వాయువ్య దిశగా కదులుతూ మరో 24 గంటలలో తీవ్రమైన తుఫానుగా మారనుంది. ఒడిషాలోని పారాదీప్ మరియు పశ్చమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్స్ మధ్యలో మే 26వ తేదీ ఉదయం తీరాన్ని దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా మే 24వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరంలో ముఖ్యంగా విశాఖపట్నం నుండి బారువా తీరం వరకు సముద్రంలో అలలు 8 నుంచి 12 అడుగుల వరకు ఎగిసిపడడంతో పాటు గాలులు 40 నుంచి 50 కి.మీ వేగంతో వీస్తాయి. మరియు కొన్ని ప్రదేశాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపలవేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము
Start Date & End Date: 
Monday, May 24, 2021 to Tuesday, May 25, 2021