ఆగ్నేయ బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో వున్న వాయుగుండం ప్రస్తుతం ఒడిషాలోని పారాదీప్ కు 1040 కి.మీ దూరంలో ఉంది. ఇది మరింత బలపడి 16వ తేదీ రాత్రికి తుఫానుగా తదుపరి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది మే 17వ తేదీవరకు వాయువ్య దిశగా కదులుతూ తదుపరి ఈశాన్యదిశగా వెళ్ళి ఒడిషా మరియు పశ్చిమబెంగాల్ మధ్య మే 19 లేదా 20వ తేదీ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కాకినాడ నుండి బారువా తీరం వరకు సముద్రంలో అలల ఎత్తు 8 నుంచి 15 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.
ఆగ్నేయ బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ పరిసర ప్రాంతాలలో వున్న వాయుగుండం ప్రస్తుతం ఒడిషాలోని పారాదీప్ కు 1040 కి.మీ దూరంలో ఉంది. ఇది మరింత బలపడి 16వ తేదీ రాత్రికి తుఫానుగా తదుపరి తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది మే 17వ తేదీవరకు వాయువ్య దిశగా కదులుతూ తదుపరి ఈశాన్యదిశగా వెళ్ళి ఒడిషా మరియు పశ్చిమబెంగాల్ మధ్య మే 19 లేదా 20వ తేదీ తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావం వలన ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలలో మే 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కాకినాడ నుండి బారువా తీరం వరకు సముద్రంలో అలల ఎత్తు 8 నుంచి 15 అడుగుల వరకు ఎగిసిపడతాయి. కావున మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి చేపల వేటకు వెళ్ళరాదని సూచిస్తున్నాము.