News Friday, April 17, 2020 - 13:11

Select District: 
News Items: 
Description: 
లాక్‌డౌన్‌, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభమైంది. లాక్‌డౌన్, కరోనాపై ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.. అధికారులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా లాక్‌డౌన్‌, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్ధాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పనిచేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకార సామాజికవర్గాన్ని ఆదుకునేందుకు అందజేసే సాయాన్ని రూ. 10 వేలకు పెంచింది. గత నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 1,02,338 మందికి వేట విరామ సాయాన్ని అందించింది. బోట్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది లబ్దిదారుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. మరపడవలను నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని.. మరపడవలపై 8 మంది, మోటర్‌ పడవలపై 6గురు, సంప్రదాయ పడవలపై ముగ్గురు కార్మికులకు వేట విరామ సాయం అందించనున్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల్లోని మత్స్యశాఖ సహాయకులు.. ఇతర సిబ్బంది.. పడవలపై పనిచేస్తున్న కార్మికుల జాబితా సేకరించి అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుల జాబితా ఖరారైన తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో వేట విరామ సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. ఈ ఏడాది వేట విరామ సమయం ప్రారంభమైన 20 రోజుల్లోనే ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అలాగే అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మత్స్యకార సామాజికవర్గాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ పలు చర్యలు ప్రారంభించారని మరియు వారి అభివృద్దే లక్ష్యంగా తాము ముందుకెళుతున్నట్లు చెప్పారు.
Regional Description: 
లాక్‌డౌన్‌, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు ఆంధ్రపదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభమైంది. లాక్‌డౌన్, కరోనాపై ప్రభుత్వం పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.. అధికారులతో చర్చిస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. తాజాగా లాక్‌డౌన్‌, చేపల వేటపై నిషేధం వల్ల దాదాపు మూడు నెలల పాటు ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టింది. 20 రోజుల్లో వేట విరామ సాయం అందించేందుకు లబ్దిదారుల గుర్తింపు ప్రారంభమైంది. క్షేత్రస్ధాయి సిబ్బంది, ప్రస్తుతం పడవలపై పనిచేస్తున్న కార్మికుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మత్స్యకార సామాజికవర్గాన్ని ఆదుకునేందుకు అందజేసే సాయాన్ని రూ. 10 వేలకు పెంచింది. గత నవంబర్‌ 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా 1,02,338 మందికి వేట విరామ సాయాన్ని అందించింది. బోట్ల సంఖ్య పెరగడంతో ఈ ఏడాది లబ్దిదారుల సంఖ్య పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం కొన్ని సూచనలు చేసింది. మరపడవలను నిర్వాహకులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని.. మరపడవలపై 8 మంది, మోటర్‌ పడవలపై 6గురు, సంప్రదాయ పడవలపై ముగ్గురు కార్మికులకు వేట విరామ సాయం అందించనున్నారు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయాల్లోని మత్స్యశాఖ సహాయకులు.. ఇతర సిబ్బంది.. పడవలపై పనిచేస్తున్న కార్మికుల జాబితా సేకరించి అర్హుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుల జాబితా ఖరారైన తర్వాత వారి బ్యాంకు ఖాతాల్లో వేట విరామ సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. ఈ ఏడాది వేట విరామ సమయం ప్రారంభమైన 20 రోజుల్లోనే ప్రభుత్వం సాయం చేస్తుందని మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అలాగే అర్హులైన ప్రతీ లబ్ధిదారుడికి సాయం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మత్స్యకార సామాజికవర్గాన్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ పలు చర్యలు ప్రారంభించారని మరియు వారి అభివృద్దే లక్ష్యంగా తాము ముందుకెళుతున్నట్లు చెప్పారు.