You are here
Disaster Alerts 16/12/2018
State:
Andhra Pradesh
Message:
బంగాళాఖాతంలో ఉన్న పెతాయి తుఫాను ఈ సాయంత్రం తీవ్రమైన తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం 16వ తేదీ సాయంత్రం 6 గంటల సమయానికి కాకినాడకు ఆగ్నేయ దిశగా 410 కి.మీ మరియు మచిలీపట్నంకు ఆగ్నేయ దిశగా 380 కి.మీ దూరంలో ఉంది. ఇది రేపు తీరం దాటే సమయంలో కొద్దిగా బలహీనపడి తుఫానుగా 17వ తేదీ మధ్యాహ్నం కాకినాడ మరియు తుని మధ్య గల ప్రాంతాలలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో దుర్గరాజుపట్నం నుంచి బారువా తీరం వరకు, డిసెంబర్ 16వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సముద్రంలో అలల ఎత్తు 10 నుంచి 18 అడుగుల వరకు ఎగిసిపడి సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. గాలివేగం 50 నుంచి 60 కిలోమీటర్లు మరియు తుఫాను తీరానికి చేరువయ్యే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. కావున మత్స్యకారులు మీ యొక్క వేటసామాగ్రి అయిన బోట్లు మరియు వలలను సురక్షిత ప్రాంతాలలోకి తరలించుకోవాలి. అలాగే డిసెంబర్ 16 మరియు 17 వ తేదీలలో తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలోని తీర ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి సముద్రానికి దూరంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.
Disaster Type:
State id:
1
Disaster Id:
2
Message discription:
బంగాళాఖాతంలో ఉన్న పెతాయి తుఫాను ఈ సాయంత్రం తీవ్రమైన తుఫానుగా మారింది. ఇది ప్రస్తుతం 16వ తేదీ సాయంత్రం 6 గంటల సమయానికి కాకినాడకు ఆగ్నేయ దిశగా 410 కి.మీ మరియు మచిలీపట్నంకు ఆగ్నేయ దిశగా 380 కి.మీ దూరంలో ఉంది. ఇది రేపు తీరం దాటే సమయంలో కొద్దిగా బలహీనపడి తుఫానుగా 17వ తేదీ మధ్యాహ్నం కాకినాడ మరియు తుని మధ్య గల ప్రాంతాలలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంగా ఆంధ్రప్రదేశ్ లోని అన్ని తీరప్రాంతాలలో దుర్గరాజుపట్నం నుంచి బారువా తీరం వరకు, డిసెంబర్ 16వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సముద్రంలో అలల ఎత్తు 10 నుంచి 18 అడుగుల వరకు ఎగిసిపడి సముద్రం అల్లకల్లోలంగా మారుతుంది. గాలివేగం 50 నుంచి 60 కిలోమీటర్లు మరియు తుఫాను తీరానికి చేరువయ్యే సమయంలో గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. కావున మత్స్యకారులు మీ యొక్క వేటసామాగ్రి అయిన బోట్లు మరియు వలలను సురక్షిత ప్రాంతాలలోకి తరలించుకోవాలి. అలాగే డిసెంబర్ 16 మరియు 17 వ తేదీలలో తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలోని తీర ప్రాంతాలలో ఒక మాదిరి నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మత్స్యకారులు అప్రమత్తంగా ఉండి సముద్రానికి దూరంగా ఉండవలసినదిగా సూచిస్తున్నాము.