News Saturday, February 17, 2018 - 10:07

News Items: 
Description: 
'టెన్త్' అర్హతతో... 'కేంద్ర' కొలువు! మీరు పదోతరగతి పాసయ్యారా.... అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించినట్లే. వీరికి 'ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్' శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ స‌ర్కిల్‌‌లో 245 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 234 పోస్ట్‌మ్యాన్, 11 మెయిల్‌గార్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్ట్‌మ్యాన్ పోస్టులకు సంబంధించి విజయవాడ పరిధిలో 106, కర్నూలు పరిధిలో 60, విశాఖ పట్నం పరిధిలో 68 ఖాళీలు ఉన్నాయి. మెయిల్‌గార్డు పోస్టులకు సంబంధించి విజయవాడ పరిధిలో ఆరు, కర్నూలు పరిధిలో రెండు, విశాఖ పట్నం పరిధిలో మూడు ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారు రూ.21,700 జీతంగా పొందుతారు. ఆసక్తి ఉన్నవారు... మార్చి 15 లోగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేష‌న్‌ చేసుకోవాలి. తర్వాత మార్చి 16 లోగా తపాలా కార్యాలయాల్లో రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి, మార్చి 20 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాతపరీక్ష తేదీని.. ఏపీ పోస్టల్ వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. రాతపరీక్షలో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, తెలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయిస్తారు. వివరాలకు www.indiapost.gov.in నందు చూసుకోగలరు.
Regional Description: 
'టెన్త్' అర్హతతో... 'కేంద్ర' కొలువు! మీరు పదోతరగతి పాసయ్యారా.... అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత సాధించినట్లే. వీరికి 'ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్' శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ పోస్టల్ స‌ర్కిల్‌‌లో 245 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 234 పోస్ట్‌మ్యాన్, 11 మెయిల్‌గార్డ్ పోస్టులు ఉన్నాయి. పోస్ట్‌మ్యాన్ పోస్టులకు సంబంధించి విజయవాడ పరిధిలో 106, కర్నూలు పరిధిలో 60, విశాఖ పట్నం పరిధిలో 68 ఖాళీలు ఉన్నాయి. మెయిల్‌గార్డు పోస్టులకు సంబంధించి విజయవాడ పరిధిలో ఆరు, కర్నూలు పరిధిలో రెండు, విశాఖ పట్నం పరిధిలో మూడు ఖాళీలు ఉన్నాయి. రాతపరీక్ష నిర్వహించి ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారు రూ.21,700 జీతంగా పొందుతారు. ఆసక్తి ఉన్నవారు... మార్చి 15 లోగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేష‌న్‌ చేసుకోవాలి. తర్వాత మార్చి 16 లోగా తపాలా కార్యాలయాల్లో రూ.500 దరఖాస్తు ఫీజు చెల్లించి, మార్చి 20 లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయసు 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. రాతపరీక్ష తేదీని.. ఏపీ పోస్టల్ వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తారు. మొత్తం 100 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నపత్రాలను రూపొందిస్తారు. రాతపరీక్షలో జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్, తెలుగు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో విభాగానికి 25 మార్కులు కేటాయిస్తారు. వివరాలకు www.indiapost.gov.in నందు చూసుకోగలరు.