News Thursday, July 6, 2017 - 21:14

Select District: 
News Items: 
Description: 
GST on Fishermen గంగపుత్రులపై జీఎస్టీ కొరడా: రెక్కాడితే గానీ డొక్కాడని గంగపుత్రులకు సైతం జీఎస్టీ భారం తప్పడంలేదు. వలలకు ఉపయోగించే నైలాన్ తాళ్ల నుంచి వేటాడిన చేపలపైనా జీఎస్టీ విధించడంతో జాలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో శ్రమిస్తే గానీ పూట గడవని దుస్థితిలో ఉన్న తమపై జీఎస్టీ రూపంలో అధిక భారం పడడంపై వారంతా వాపోతున్నారు. జులై 1 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీతో వలలపై 12%, నైలాన్ తాళ్లు, ఎండు చేపలపై 18% పన్ను అధికమవడంతో గంగపుత్రులు కుదేలయ్యారు. కొత్త నిబంధనల కారణంగా తమ జీవనోపాధి దెబ్బతినడంతో పాటూ తాము ఆర్ధికంగా కుదేలైపోతామని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటికే చేపల ఖరీదు పెరగడంతో వినియోగదారులు సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా కొంత బిజినెస్ పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ జీవితాలు అంధకారం అయిపోతాయని గంగపుత్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మత్స్యకారులు వలలు నేయడానికి వినియోగించే తాళ్లపై పన్ను గతంలో 7% ఉండేది. ఇప్పుడది 12%నికి చేరింది. అంటే 11% ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారీగా పన్ను చెల్లించడాన్ని గంగపుత్రులు పెను భారంగా భావిస్తున్నారు. పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో జీఎస్టీ కారణంగా వచ్చిన కొత్త నిబంధన తమ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. పన్ను పెరగడం వల్ల చేపల వేట వీడి వలసలు వెళ్లి కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని పలువురు మత్స్యకారులు అంటున్నారు. చేపల వేటకు సంబంధించిన ప్రతీ పనిముట్టు రేటు పెరగడంతో ఇప్పటికే పలువురు వలస కార్మికులుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బడగుల జీవనోపాధి, జీవితాలు ప్రభావితం కాకుండా చేయూతనివ్వాలని, ఫిషింగ్‌పై పెంచిన అధిక పన్ను తగ్గేలా చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు కోరుతున్నారు.
Regional Description: 
గంగపుత్రులపై జీఎస్టీ కొరడా: రెక్కాడితే గానీ డొక్కాడని గంగపుత్రులకు సైతం జీఎస్టీ భారం తప్పడంలేదు. వలలకు ఉపయోగించే నైలాన్ తాళ్ల నుంచి వేటాడిన చేపలపైనా జీఎస్టీ విధించడంతో జాలర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతో శ్రమిస్తే గానీ పూట గడవని దుస్థితిలో ఉన్న తమపై జీఎస్టీ రూపంలో అధిక భారం పడడంపై వారంతా వాపోతున్నారు. జులై 1 నుంచి అమలులోకి వచ్చిన జీఎస్టీతో వలలపై 12%, నైలాన్ తాళ్లు, ఎండు చేపలపై 18% పన్ను అధికమవడంతో గంగపుత్రులు కుదేలయ్యారు. కొత్త నిబంధనల కారణంగా తమ జీవనోపాధి దెబ్బతినడంతో పాటూ తాము ఆర్ధికంగా కుదేలైపోతామని మత్స్యకారులు అంటున్నారు. ఇప్పటికే చేపల ఖరీదు పెరగడంతో వినియోగదారులు సంఖ్య తగ్గిపోయింది. ఫలితంగా కొంత బిజినెస్ పడిపోయింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే తమ జీవితాలు అంధకారం అయిపోతాయని గంగపుత్రులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. మత్స్యకారులు వలలు నేయడానికి వినియోగించే తాళ్లపై పన్ను గతంలో 7% ఉండేది. ఇప్పుడది 12%నికి చేరింది. అంటే 11% ఎక్కువగా చెల్లించాల్సి వస్తోంది. ఇంత భారీగా పన్ను చెల్లించడాన్ని గంగపుత్రులు పెను భారంగా భావిస్తున్నారు. పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో జీఎస్టీ కారణంగా వచ్చిన కొత్త నిబంధన తమ జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని చెప్తున్నారు. పన్ను పెరగడం వల్ల చేపల వేట వీడి వలసలు వెళ్లి కూలీలుగా పనిచేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని పలువురు మత్స్యకారులు అంటున్నారు. చేపల వేటకు సంబంధించిన ప్రతీ పనిముట్టు రేటు పెరగడంతో ఇప్పటికే పలువురు వలస కార్మికులుగా మారాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బడగుల జీవనోపాధి, జీవితాలు ప్రభావితం కాకుండా చేయూతనివ్వాలని, ఫిషింగ్‌పై పెంచిన అధిక పన్ను తగ్గేలా చర్యలు తీసుకోవాలని గంగపుత్రులు కోరుతున్నారు.